Monday, 25 April 2016

తెలంగాణ మంత్రివర్గంలో శాఖల మార్పు షురూ అయ్యింది. రాష్ట్ర మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులకు గవర్నర్ నరసింహన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిఎం కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఫలితంగా కేటీఆర్‌కు పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, మైనింగ్‌, విదేశీ వ్యవహారాలు జూపల్లికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి.
తలసానికి పశుసంవర్థక, మత్స్య, పాడి, సినిమాటోగ్రఫీ. పోచారానికి వ్యవసాయంతో పాటు అదనంగా సహకారశాఖ అప్పగించినట్టు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖను సీఎం కేసీఆర్ తన వద్దనే ఉంచుకోవచ్చని తెలుస్తోంది. ఇటీవలే పురపాలకశాఖను అదనంగా అందుకున్న ఐటి మంత్రి కెటిఆర్ కు పరిశ్రమలు, మైనింగ్ కూడా అప్పగించారు.

Sunday, 24 April 2016

అడల్ట్ సినిమాలు చేస్తాను కానీ..

అడల్ట్‌, సెక్స్ కామెడీ వంటి సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమేనంటూ సంకేతాలిచ్చేసింది బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి. కాకపోతే బాలీవుడ్‌లో అలాంటి ఫిల్మ్స్ చేయనని క్లారిటీ ఇచ్చేసింది. అమెరికా లేదా విదేశాల్లో అయితే అలాంటి సినిమాలు చేసినా ఎలాంటి అభ్యంతరం వుండదని చెప్పుకొచ్చింది. ఆ విషయంలో సెన్స్‌ హ్యూమర్‌ ఇండియాలో చాలా భిన్నంగా ఉంటుంది. అదే అమెరికా, జర్మనీ, లండన్‌లో అయితే వాళ్ల సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ వేరే రకంగా ఉంటుందని అంటోంది.
బాలీవుడ్‌లో ఇప్పుడు అడల్ట్ కామెడీ సినిమాలకు మంచి మార్కెట్టే ఉంది. గ్రాండ్ మస్తీ, క్యా కూల్ హై హమ్, మస్తీజాదే వంటి పెద్దల సినిమాలు కాసులు రాబట్టాయి. అయితే, బాలీవుడ్‌లో వచ్చిన అడల్ట్ కామెడీ సినిమాలు చూడలేదని నర్గీస్ తెలిపింది. అక్షయ్‌ కుమార్, అభిషేక్ బచ్చన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హెడెన్‌ వంటి ప్రముఖ తారాగణంతో సాజిద్-పర్హాద్ ద్వయం 'హౌస్‌ఫుల్-3'ను తెరకెక్కిస్తోంది. ఈ మూవీతోపాటు 'అజార్‌'లోనూ నర్గీస్ నటిస్తోంది. అమెరికాకు చెందిన 36 ఏళ్ల మోడల్ అయిన నర్గీస్‌కు ప్రజెంట్ బాలీవుడ్‌లో మంచి ఆఫర్లే వస్తున్నాయి. మొత్తానికి ఏదైతేనేం.. మనసులోని మాటను బయటపెట్టేసింది నర్గీస్ ఫక్రి.

హాలీవుడ్ స్టయిల్‌లో శాతకర్ణి వార్ సీన్స్!

బాలకృష్ణ- క్రిష్ కాంబోలో రానుంది ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. రీసెంట్‌గా మూవీ ప్రారంభం కావడంతో సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందన్నదానిపై సినీ లవర్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఇందులోని ప్రతిసీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్కెచ్ వేస్తున్నాడు డైరెక్టర్. హిస్టరీ నేపథ్య మూవీ అనగానే ముందుగా కాస్ట్యూమ్స్ అందరికీ గుర్తుకొస్తాయి. బాహుబలి, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలు హిట్ కావడం వెనుక కాస్ట్యూమ్స్‌దే కీలకపాత్ర. ఈ ఫిల్మ్‌నీ ఆ రేంజ్‌లో చేయాలనుకుంటున్నాడు క్రిష్. అలాగే ఈ సినిమాలోని మరిన్ని విషయాలపై పరిశోధకులు, ఆర్కియాలజీ నిపుణులతో కలసి లోతుగా పరిశీలిస్తున్నాడు. ఇవన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫస్ట్‌లుక్ ఖరారు చేయనున్నారని యూనిట్ చెబుతోంది.
మరోవైపు ఐదు మేజర్ సెట్స్‌పై మూవీని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అందులో చెప్పుకోదగినది ఆనాడు శాతకర్ణి పాలించిన నగరం అమరావతి. ఇటు హిస్టరీ బేస్డ్ సినిమాలకు లొకేషన్స్ చాలా కీలకం. వందల ఏళ్ల చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను సృష్టించడం సెట్టింగ్స్‌‌కే బోలెడంత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే వార్ సీన్స్‌కు మొరాకోను ఎంపిక చేసినట్టు ఇన్‌సైడ్ సమాచారం. దీన్ని హాలీవుడ్ రేంజ్‌లో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు క్రిష్. దాదాపు 3 నెలలపాటు యూనిట్ అక్కడ మకాం వేయబోతోందట. మొత్తానికి అలనాటి శాతవాహన రూలర్‌ని కళ్లకు కట్టినట్టు చూపించనున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి ‘శాతకర్ణి’ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. 

ప‌వ‌న్ పొలిటిక‌ల్ ప్లాన్ చూస్తే షాక‌వ్వాల్సిందే

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన గురించి హాట్ హాట్‌గా డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్నాయి. స‌ర్దార్ సినిమా రిలీజ్‌కు ముందు ప‌వ‌న్ తాను మ‌రో మూడు నాలుగు సినిమాలు మాత్ర‌మే చేస్తాన‌ని…వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న జ‌న‌సేన రాజ‌కీయంగా బ‌రిలోకి దిగుతుంద‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మిగిలిన పార్టీల‌న్ని అలెర్ట్ అవ్వ‌డంతో పాటు ఎవ‌రి లెక్క‌ల్లో వారు మునిగి తేలుతున్నారు. ప‌వ‌న్ ఎవ‌రి వైపు అయినా ఉంటాడా ? లేదా ఒంట‌రిగానే పోటీ చేస్తాడా అని ఎవ‌రికి వారు చ‌ర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే పవన్ తన దగ్గర ఎన్నికలను నడిపేంత డబ్బు లేదని.. అందుకే ఇంకొన్ని సినిమాలు మాత్రమే చేసి బయటకు వచ్చేస్తానని కూడా చెప్పారు. అలాగే 2019 కల్లా పూర్తి స్థాయి పార్టీని, కార్యాచరణను నిర్మించడానికి పవన్ ఇప్పటి నుంచే చాలా సీక్రెట్‌గా ప‌నులు స్టార్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.
ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల కోసం తన అనుచర గణాన్ని రంగంలోకి దింపి ప్రస్తుత రాజకీయాల పట్ల ప్రజల్లో అంతర్గతంగా ఉన్న అభిప్రాయాలను, తన నుంచి వాళ్లేమి ఆశిస్తున్నారు… అస‌లు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి పాల‌న కావాల‌నే దానిపై సీక్రెట్ చేయిస్తున్నాడ‌ని స‌మాచారం. కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ అభిమానులు విజ‌య‌వాడ‌లో మీటింగ్ కూడా పెట్టి పార్టీ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. అలాగే త్వరలో పవన్ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. 2019 ఎన్నిక‌ల టార్గెట్‌గా ప‌వ‌న్ ఆడుతున్న ఈ న్యూ పొలిటిక‌ల్ గేమ్ ఎలా ప్ర‌త్య‌ర్థుల‌కు ద‌డ పుట్టిస్తుందో చూడాలి.